
Allu Aravind : ‘బెల్లం చుట్టూ ఈగలు’ సామెత అక్షర సత్యం. ఎక్కడైతే డబ్బు, పరపతి ఎక్కువగా ఉంటుందో ప్రపంచమే అటువైపునకు వంగుతుంది. ఛీ అన్నవారే.. డబ్బు ఉంటే గొప్పవారిగా కీర్తిస్తారు. ఇది ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సినిమాలను కొంచెం పక్కన పెడితే పొలిటికల్ గా కీలకమైన వ్యక్తిగా మారాడు. ఇటు స్టేట్ లో కూటమి అధికారంలోకి వచ్చేందుకు, అటు సెంట్రల్ లో బీజేపీ పార్టీ అధికారంలో ఉండేందుకు సపోర్ట్ ఇచ్చాడు.
ఎన్డీయే కూటమితో వెళ్తేనే గెలవచ్చని జగన్ ను గద్దె దించొచ్చని కూటమిని ఏర్పాటు చేసి ముందుకు కదిలాడు. ఫలితం గ్రాండ్ లెవెల్ లో కనిపించింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా నిర్మాతల మండలి ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇందులో అల్లు అరవింద్ మాత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసేలా అపాయింట్మెంట్ ఇప్పించమని పవన్ కళ్యాణ్ ను కోరినట్లు చెప్పారు. సీఎంను, డిప్యూటీ సీఎంను సన్మానించుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమా యూనిట్ ఉందని తొందరలోనే సన్మానించుకుంటామంటూ క్లారిటీ ఇచ్చారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చీఫ్ గా చూసిన అల్లు అరవింద్ పాలిటిక్స్ లో ఏం గెలుస్తాడు చక్కగా సినిమాలు చేసుకోవచ్చు కదా అని వాళ్ల సన్నిహితుల వద్ద చాలా సార్లు అన్నాడట.
పవన్ గెలిచిన తర్వాత మా వాడు అంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తూన్నాడు అల్లు అరవింద్. ఆయన విజయానికి వీళ్లు ఏ రకంగా ఉపయోగపడలేదు. కానీ గెలిచిన తర్వాత ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎవ్వరినీ దూరం పెట్టకుండా తన వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరిని తన వాళ్లు అనుకొని స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నాడు.