Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ను అల్లు అర్జున్ పరామర్శించారు. అలాగే మృతి చెందిన రేవతి భర్తను పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట దిల్ రాజ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కాగా, కిమ్స్ ఆస్పత్రికి వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చారు.
Breaking News