
ఏపీకీ మరో కంపెనీ గుడ్ బై చెప్పింది అదే అమరరాజా కంపెనీ. బ్యాటరీల తయారీలో ఆసియాలోనే అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన తన సంస్థ కొత్త లిథియం-ఐయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ ను తెలంగాణలో నిర్ణయం తెలిసిందే. శనివారం నాడు అమరరాజా గిగా కారిడార్ కు తెలంగాణ పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ తొలిసారిగా గిగా కంపెనీ అమరరాజా గిగా కారిడార్ కు దివిటిపల్లి వద్ద కేటీఆర్ శంకుస్తాపన చేశారు.
దివిటిపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ కు 90 కిలోమీటర్ల ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద యూనిట్ ను అమర రాజా కంపెనీ ఏర్పాటు చేయనుండడం గమనార్హం.గతంలో కేటీఆర్ తో అమరరాజా బ్యాటరీలు అవగాహన ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. 9.500 కోట్ల పెట్టుబడి పెట్టే ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చిన అతిపెద్ద దేశీయ పెట్టుబడి ఇదే. దీంతో 4500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. త్వరలో పనులు ప్రారంభం కానున్న పనులకు తొలిదశలో 2000 వేల వరకు పెట్టుబడులు పెడతారు.
అయితే అంతర్జాతీయంగా పేరున్న Amara raja కంపెనీ తన సొంత రాష్ట్రం పై మక్కువతో చిత్తురు జిల్లాలో ఈ ప్రరిశ్రమ పెట్టి వేలాది మందికి ఉపాది కల్పించింది. 2019 వరకు బాగానే ఉన్నా జగన్ సీఎం అయ్యాక అమరరాజా కంపెనీపై కక్ష సాధింపు చర్యలకు దిగారు దీనికి కారణం మరో రకంగా టీడీపీ నేత అయిన గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీ కావడమే.
అయితే జగన్అధికారంలోకి వచ్చిన కొత్త కియా మోటర్ దాడులు కొనసాగించారు. ఆ తర్వాత అమరరాజా కంపెనీపై కక్ష సాధింపులకు దిగాడు. దాంతో ఏపీలో పెట్టుబడులు పెట్టెందుకు కంపెనీలు వెనకడుకు వేస్తున్నాయి. అమరరాజా కంపనీ తెలంగాణకు వెళ్లడానికి సీఎం జగనే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.






