Amaravati : ప్రధాని నరేంద్ర మోడీ నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మొత్తం రూ. లక్ష కోట్లతో అమరావతి నిర్మాణం జరగనుంది. మొదటి దశకు రూ. 55,343 కోట్లు, రెండో దశకు రూ. 41,170 కోట్లు ఖర్చు అవుతాయి. 33 వేల ఎకరాల రైతుల భూములతో ఏర్పడిన అమరావతి, తొలిసారి 2014లో శంకుస్థాపన జరిగింది. 9 సిటీస్ కాన్సెప్ట్, విశాల రోడ్లు, అండర్గ్రౌండ్ లైన్స్, బ్లూ-గ్రీన్ జోన్లతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే ఎయిమ్స్, విట్, ఎస్సార్ఎం వంటి సంస్థలు రాగా, 131 కేంద్ర, ప్రైవేట్ సంస్థలకు భూములు కేటాయించారు.