
ఏపీ రాజధాని అమరావతిలోని భూములను ప్రత్యేక ఆర్-5 జోన్ గా ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు జీవో నెంబర్ 45 ని జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తు అమరావతి farmers ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 45 ను రద్దు చేయాలని, ఇళ్ల స్థలాల పంపిణీని అపేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుల వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వారు దాఖలు చేసిన రైండు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
అయితే రైతుల పిటిషన్ విచారణ సందర్భంగా హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేదలకు భూములు ఇవ్వొద్దా అంటూ జస్టీస్ ప్రశాంత్ కుమార్ ప్రశ్నించారు. కోర్టు తుది తీర్పుకు లోబడి తమ అదేశాలు ఉంటాయని తెలిపారు.
అయితే నిన్న హైకోర్టు తీర్పుపై ఈ రోజు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్ లో వేరేప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు, జీవో నెంబర్ 45ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ను తీసుకోచ్చందన్నారు రైతులు. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఇవ్వాలని సుప్రీంను కోరారు రైతులు. హైకోర్టులోనే తేల్చుకోవాలని రైతులకు సుప్రీం సూచించడంతో ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. మళ్లీ ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.
హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ farmers పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు రానుంది. అమరావతి రైతుల తరపు న్యాయ వాదులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.






