
జీవితమే లక్. విధి ఎవరిని ఎప్పుడు ఎలా ఏ విధంగా ఆడుకుంటుందో తెలియదు. ఎవరి జీవితాన్ని ఎప్పుడు ఎలా ముగిస్తోందో చెప్పలేం. అందుకే అంటారు పెద్దలు విధి రాసిన రాతను ఎవరివల్ల కాదని. కరీంనగర్కు చెందిన ఓ విద్యార్థి జీవితం కూడా ఇలాగే అర్ధాంతరంగా విధి ఆడిన వింత నాటకంలో ముగిసి పోయింది.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంకు చెందిన నివాస్ రెడ్డి హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. నివాస్ కుటుంబం చాలా అనోన్యంగా ఉండేది. నివాస్ కు ఒక అన్న ఉన్నాడు. వీరి తల్లిదండ్రులకు ఇద్దరు కుమారు కావడంతో…వారి పిల్లలను కష్టపడి చదివించారు. నివాస్ అన్న కూడా బిటెక్ పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలోనే నివాస్ అన్నకు అమెరికా వెళ్లేందుకు అవకాశం చిక్కింది. ఆయన త్వరలోనే వీరి కుటుంబం నుంచి యూఎస్ వెళ్లే పనిలో ఉన్నారు. ఇక గత నెల 28న నివాస్ పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్లో ఘనంగా జరుపుకున్నారు.
అటు అన్న అమెరికా వెళ్లనుండడంతో పలు పనులపై నివాస్ హైదరాబాద్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నివాస్కు సంబంధించిన ఒక స్నేహితుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా..వెహికిల్ డివైడర్ను ఢీకొట్టింది. దీంతో నివాస్ రెడ్డి స్పాట్లో మృతి చెందారు. అయితే అన్న ఒకవైపు యూఎస్ వెళుతుండనే ఆనందంలో కుటుంబ సభ్యులుండగా.. అర్ధాంతరంగా నివాశ్ రెడ్డి యాక్సిడెంట్లో మృతి చెందడంతో అతని ఫ్యామిలీ కన్నీటి పర్యంతమైంది. విధి ఆడిన వింత నాటకంలో నివాశ్ రెడ్డి తనువు చాలించడంతో..అతని కుటుంబం బోరున విలపిస్తోంది.






