
Gudem Mahipal Reddy : బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ వెంట ఢిల్లీ వెళ్లిన మహిపాల్ రెడ్డి ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎన్నికలకు ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఎన్నికల ఫలితాల తర్వాత పోచారం, సంజయ్ కుమార్ చేరారు. గూడెం మహిపాల్ కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరుతుంది.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ అధికారులు దాడులు చేశారు. అక్రమ మైనింగ్ తో రూ.300 కోట్లు కూడబెట్టారని గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లించాల్సిన మరో రూ.39.08 కోట్లు ఎగవేసినట్టు వెల్లడించారు.