
YS Bharti PA Arrest : మాజీ సీఎం జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలో సోషల్ మీడియాలో విపక్ష మహిళా నేతలే టార్గెట్ గా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై అభియోగాలున్నాయి. వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, హోంమంత్రి అనితలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులపై సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు సమాచారం. తనపై, వైఎస్ షర్మిలపై అనుచిత పోస్టులు పెట్టారంటూ వైఎస్ సునీత చేసిన ఫిర్యాదుతో రవీంద్రపై సైబరాబాద్ క్రైం పోలీసులు సైతం ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. అటు రవీంద్రపై చర్యలు ఉంటాయని ఇప్పటికే హోం మంత్రి అనిత తెలిపారు.
వరుస ఆరోపణల నేపథ్యంలో వైఎస్ భారతి పీఏ రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. కడప నుంచి కదిరి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.