
Aditya Singh Rajput : సినీ ఇండస్ట్రీ లలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన మరొక నటుడు మృతి చెందాడు.. అది కూడా అనుమానాస్పద స్థితిలో మరణించడం ఆయన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంది.. ఇంతకీ ఆ స్టార్ నటుడు ఎవరు అని అనుకుంటున్నారా.. అతడు బాలీవుడ్ కు చెందిన నటుడు..
ముంబై లోని అంధేరి లో తన అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించారు. తన అపార్ట్ మెంట్ లోని బాత్రూం లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. ఇది అనుమానాస్పద మృతిగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే ఈయన డ్రగ్ ఓవర్ డోస్ వల్లనే మరణించినట్టు పోలీసులు గుర్తించారు..
ఈయన పేరు ఆదిత్య సింగ్ రాజ్ పుత్.. యాక్టర్ అండ్ మోడల్ గా రాణిస్తున్న ఆదిత్య క్రాంతివీర్, మైనే గాంధీ నహీ మారా చిత్రాలతో పలు రియాలిటీ షోలలో కూడా ఆదిత్య పాల్గొన్నారు.. ఈయన ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న స్టార్.. అలాంటిది ఈయన మరణంతో మరోసారి బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి..
ఈయన బాత్రూం లో అనుమానాస్పదంగా మరణించి పోలీసులకు నిర్జీవంగా కనిపించాడు.. అతను ఉంటున్న అపార్ట్ మెంట్ లోని 11వ అంతస్తు వాష్ రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్నాడని స్నేహితుడు గుర్తించి సమీపం లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.. అయితే ఆసుపత్రికి వెళ్లేలోపే మరణించినట్టు వైద్యులు తెలిపారు.






