
Celkon CMD Guru : ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తో సెల్ కాన్ గ్రూప్ సీఎండీ వై.గురు గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఏపీని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని వై.గురు చెప్పారు. ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ కు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వై.గురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రముఖ హబ్ గా మార్చేందుకు తాను పూర్తిగా సమాయత్తమయ్యానని, పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఐటీ మంత్రి ఈ సమావేశంలో తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ రరంగం, 2024 నాటికి 115 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని చెప్పారు. ప్రస్తుతం భారతదేవం రూ.1,20,000 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ లను ఎగుమతి చేస్తోందని చెప్పారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లో తమ ప్లాంటు ఉందన్నారు.