
Megastar Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కందుల దుర్గేష్ నిన్న టాలీవుడ్ అగ్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ‘విశ్వంభర’ మూవీ సెట్స్ లో వీరు కలుసుకొని కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మంత్రి దుర్గేష్ కు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, దర్శకుడు వశిష్ట, నిర్మాతలు పాల్గొన్నారు. అనంతరం తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వం తరపున చేయవలసిన పనుల గురించి చిరంజీవి. మంత్రి చర్చించారు. కాగా, చిరంజీవి ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.