
Uttar Pradesh : ఓ పెళ్లి వేడుకలో చికెన్ బిర్యానీ లెగ్ పీస్ ఘర్షణకు దారితీసింది. ఉత్తర్ ప్రదేశ్ రాయ్ బరేలీలో జరిగిన ఓ వివాహ వేడుక జరిగింది. అందులో ఏర్పాటు చేసిన విందులో పెళ్లి కొడుకు తరపు వ్యక్తికి లెగ్ పీస్ రాలేదు. ఈ విషయమై ఆయన వడ్డించేవారికి ప్రశ్నించగా అది పెద్ద గొడవకు దారితీసింది.
అంతకంతకూ గొడవ పెరిగి అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. పెళ్లికొడుకు కూడా ప్రత్యర్థులపై దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘర్షణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.