18.9 C
India
Friday, February 14, 2025
More

    Karnataka News : కూతురితో కలిసి భర్తను చంపించిన ఆంటీ.. ప్రియుడితో కలిసి దారుణంగా నరికి..

    Date:

    Karnataka News
    Karnataka News

    Karnataka News : నేటి సమాజంలో మానవత్వం కరువైంది. నా అన్నవాళ్లే ఆస్తుల కోసం, పగల కోసం, ప్రేమల కోసం, వివాహేతర సంబంధాల కోసం, పరువు కోసం చంపేస్తున్నారు. భార్యను భర్త, భర్తను భార్య, తల్లిదండ్రులను పిల్లలు, పిల్లలను తల్లిదండ్రులు అంతమొందిస్తున్నారు. దేశంలో ప్రతీ నిమిషం ఏదో ఒక చోట హత్యలు జరుగుతూనే ఉండడం బాధాకరం.

    కర్నాటకలోని తుమకూరు జిల్లాలోని కులినంజయ్యన్ గ్రామంలో నాలుగు రోజుల కింద జరిగిన ఉపాధ్యాయుడు మరియప్ప(47) హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో వెల్లడైన విషయాలు షాకింగ్ గురిచేస్తున్నాయి. మనుషులు ఇలా కూడా ఉంటారా? అని ప్రతీ ఒక్కరూ ఆవేదన చెందుతున్న దారుణ సంఘటన ఇది..

    ఫిబ్రవరి 9న మోడూరు పాఠశాలలో గెస్ట్ టీచర్ గా పనిచేస్తున్న మరియప్పను తుముకూరు జిల్లా కుణిగల్ తాలుకాలోని పొలంలో దారుణంగా నరికి చంపారు. మరియప్పను ఎవరైనా పగతో చంపి ఉంటారని పోలీసులు మొదటగా అనుమానించారు. ఆ నేపథ్యంలో విచారణ ప్రారంభించారు. అనేక ట్విస్ట్ ల తర్వాత అసలు నిజం తెలిసి నివ్వెరపోయారు. మరియప్ప హ్యత కేసులో ఆయన భార్య, కూతురితో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    ఉపాధ్యాయుడు మరియప్ప అతడి భార్య శోభా, కూతురు హేమాలతతో కలిసి పేదరికంలో ఉన్నా చాలా హాయిగా జీవిస్తున్నారు. అయితే ఎదిగిన కూతురు హేమలత అదే గ్రామానికి చెందిన శాంతకుమార్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే వీరి ప్రేమకు తల్లి శోభా అంగీకరించినా తండ్రి ఒప్పుకోలేదు. కోపంతో శాంతకుమార్ ను కొట్టాడు. దీంతో మరియప్పపై అతడి కుమార్తె బాయ్ ఫ్రెండ్ శాంతకుమార్ ద్వేషం పెంచుకున్నాడు. మరియప్పపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. బెంగళూరులో నివాసముంటున్న తన స్నేహితులతో కలిసి మరియప్పను చంపడానికి స్కెచ్ రెడీ చేశాడు.

    ఈ విషయం ప్రేమికురాలు హేమలతకు, ఆమె తల్లి శోభాకు కూడా చెప్పాడు. వారు కూడా దీనికి అంగీకరించారు. సొంత భర్త, సొంత తండ్రి హత్యకు వీరు అంగీకరించడమే ఇక్కడ గుండెలను కలిచివేసే అంశం. ఇక వీరి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో  మరియప్పను చంపేందుకు శాంతకుమార్ సుపారీ ఇచ్చాడు.

    మరియప్ప కదలికలపై తల్లీకూతుళ్లు కలిసి శాంతకుమార్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు. హత్య జరుగబోతున్న రోజు..మరియప్ప అమావాస్య పూజలు ముగించకుని సొంత గ్రామానికి వస్తున్నాడని భార్య శోభా, ప్రియురాలు హేమలత.. శాంతకుమార్ కు సమాచారం అందించారు.

    గ్రామ పొలిమేరలోకి మరియప్ప బైక్ పై చేరుకుంటుండగా దుండగులు మరియప్ప ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లారు. భయంతో బైక్ దిగి పారిపోబోయిన మరియప్పను వెంబడించి.. వేటాడి దుండగులు ఆయన్ను కిరాతకంగా నరికి చంపారు. ఈ కేసు విచారణను పూర్తి చేసిన పోలీసులు మరియప్ప భార్య శోభా, కూతురు హేమలత, ప్రియుడు శాంత కుమార్, మిగతా నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

    Share post:

    More like this
    Related

    KCR : 19న ఫామ్‌హౌస్ నుంచి బయటకు కేసీఆర్ !

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో...

    Jagan : కేడర్ కోసం జగన్ కీలక నిర్ణయం – ఇక నుంచి..!!

    Jagan : మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధికారంలో...

    Ublood : శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వార్షికోత్సవం.. అతిథిగా సీతక్క.. యూబ్లడ్ యాప్ పోస్టర్స్ ఆవిష్కరణ

    Ublood : ప్రతిభను ప్రోత్సహిస్తూ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ విశేష సేవలందిస్తున్న శ్రీనివాస...

    Bird flu : ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ.. ఓ వ్యక్తికి పాజిటివ్!

    Bird flu : ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sookshmadarshini : సూక్ష్మ దర్శిని సినిమా చూసి భార్యను హత్య చేసిన గురుమూర్తి

    Sookshmadarshini : సూక్ష్మ దర్శిని సినిమాలో తరహాలో మాధవి మృతదేహాన్ని డిస్పోస్ చేసిన...

    HMPV Case : భారత్‌లోకి చైనా వైరస్.. బెంగళూరులో తొలి చైనా HMPV కేసు గుర్తింపు

    HMPV case : చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది....

    Crime News : గ్రీల్స్ లో ఇరుక్కున్న బాలుడి తల

    Crime News : యాదగిరిగుట్టపై ఓ బాలుడికి ప్రమాదం తప్పింది, దర్శనార్థం...

    Warangal : వరంగల్‌లో దారుణ హత్య

    Warangal : వరంగల్ నగరంలో పట్టపగలే హత్య చేసి మృతదేహాన్ని కార్లో...