Indigestion problems : ప్రస్తుత రోజుల్లో కడుపులో మంట, గొంతులో మంట, గ్యాస్, మలబద్ధకం, తేన్పులు, అజీర్తి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో మనకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి నుంచి బయట పడటానికి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. కళ్లల్లో మంట, తలనొప్పి, అల్సర్ వంటి సమస్యలు చుట్టుముడతాయి. దీనికి మనం కొన్ని పరిహారాలు పాటించాలి.
సోంపు, జీలకర్ర, ధనియాలు మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. వీటితో మన రోగాలు దూరం కావడం సహజం. వంటింట్లో ఉండే పదార్థాలే మనకు రక్షణగా నిలబడతాయి. జీర్ణ సమస్యలు దూరం చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీనికి గాను సులభమైన చిట్కా ఉంది. దాన్ని వాడుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి చొరవ చూపాలి.
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు వేసుకుని కలుపుకోవాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం రెండు నిమిషాలు మరిగించి వడకట్టుకుని గ్లాసులో పోసుకోవాలి. ఇలా ఈ కషాయాన్నిప్రతి రోజు ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
ఇందులో రుచి కోసం నల్ల ఉప్పు లేదా తేనె వాడుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కషాయంతో శరీరంలో డీ హైడ్రేషన్ సమస్య రాదు. ఒత్తిడి తగ్గుతుంది. అరచేతులు, అరికాళ్ల మంటలు తగ్గుతాయి. నొప్పులు, వాపులు దూరం అవుతాయి. జీర్ణ సమస్యలు లేకుండా పోతాయి. ఇలాంటి చిట్కాను వాడుకుని జీర్ణ శక్తిని పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.