అనుష్క, నవీన్ జంటగా నటించి విడుదలకు సిద్ధం అవుతుంది ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహించారు. ఇందులో మిస్ శెట్టిగా చేస్తున్న అనుష్క చెఫ్ పాత్రలో నటించగా, మిస్టర్ పోలిశెట్టిగా నవీన్ స్టాండప్ కమేడియాన్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా రీలీజైన ఈ మూవీ టీజర్ భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. దీంతో చిత్రం విజయంపై భారీ అంచనాలు నమోదయ్యాయి. టీజర్ చూసిన బాహుబలి ప్రభాస్, మగధీర రాం చరణ్ స్పందించారు. వారు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
మిస్ పోశెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రం టీజర్ కు సినీ అభిమానుల నుంచే కాకుండా స్టార్ హీరోల నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. వారు కూడా చిత్ర ప్రమోషంలో భాగంగా మారారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ను వారు కూడా తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా షేర్ చేశారు. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ బాగా నచ్చింది. ఇది చూస్తున్నంత సేపు చాలా రీఫ్రెష్ గా ఫీలయ్యా, ఈ మూవీ టీంకు గుడ్ లక్ అంటూ చెప్పుకచ్చారు రాం చరణ్, ఇక ప్రభాస్ కూడా తనతో కలిసి నటించిన అనుష్క ఈ చిత్రంలో మరింత రీఫ్రెష్ గా కనిపిస్తుందని, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ప్రభాస్ కూడా విష్ చేశాడు. పాన్ ఇండియా స్టార్లు టీజర్ కు హైప్ ఇవ్వడం టీమ్ మొత్తానికి గ్రేట్ అచీవ్ మెంట్ గా నిలిచింది.
టీజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే బాగా వైరల్ అయ్యింది. అద్భుతంగా ఉందని కొందరు ప్రశంసలు కురిపించారు. హీరోలు అన్నట్లుగానే చాలా మంది సినీ అభిమానులు, నెటిజన్లు చాలా రీఫ్రెష్ గా ఉందని కామెంట్లు పెట్టారు. ఇక అనుష్క విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ‘యూవీ’ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. హీరో, హీరోయిన్లతో పాటు జయసుధ, తులసి, మురళీ శర్మ తదితరులు ఇందులో నటిస్తున్నారు.