మహానుభావులు ఏం చేసినా అది ప్రజల కోసమే. తన కుటుంబం గురించి ఆలోచించని వాడు యోగి అవుతాడని పెద్దలు చెప్పిన వ్యాఖ్యాలు సీనియర్ నందమూరి తారక రామారావుకు వర్తిస్తాయి. ఆయన ఇంటి కంటే ఎక్కువ సమాజాన్నే ప్రేమించే వారు. సమాజమే తన ఇల్లుగా భావించి వారి కష్టాల్లో భాగంగా ఉండేవారు. ఇక ఆయన సతీమణి బసవతారకం కూడా అలాగే మెదిలే వారు. అటు భర్తను, ఆయన తరుపు వారితో పాటు కుటుంబాన్ని కూడా ఆమె సవరించేవారు. బసవతారకం మరణం మొత్తం కుటుంబాన్నే తీవ్ర నిరాశలోకి నెట్టింది. అప్పట్లో ఎన్టీఆర్ కూడా ఆమె తలుచుకోలేని రోజు లేదని చెప్తుండేవారు.
ఎన్టీఆర్ మహానటుడిగానే కాకుండా మహా నాయకుడిగా కూడా కీర్తి గడించారు. తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు వేసి తెలుగు వారికి గుర్తింపు సంపాదించడంతో పాటు ఔరా అనిపించుకున్నారు. నటిస్తూనే దేశ సేవ చేయాలని సంకల్పించాడు. ఒక వైపు నటన సాగిస్తూనే తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని పెట్టి రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి గొప్ప నాయకుడిగా కూడా దేశం యావత్తు గర్వపడేలా పాలించారు. తన సొంత కుటుంబం కంటే సమాజానికే ఎక్కువ విలువ ఇచ్చేవారు ఎన్టీఆర్.
నందమూరి తారక రామారావుకు మొత్తం 12 మంది సంతానం.. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కుమార్తెలు. వీరందరిలో 6, 7 సంతానంగా పుట్టిన వారే బాలకృష్ణ, హరికృష్ణ. అయితే వీళ్లిద్దరికీ ఒకే సారి ఒకే ముహూర్తానికి వివాహం జరిగింది. 8 డిసెంబర్, 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో వివాహం జరిగింది. ఇద్దరి కొడుకుల వివాహానికి ఎన్టీఆర్ రాలేదట. అసలు ఎందుకు రాలేదు అనుకుంటున్నారా..? ప్రజాయాత్ర వల్ల రాలేకపోయారట. అవునండి మీరు చదివింది నిజమే..
బాలకృష్ణ, రామకృష్ణ వివాహ సమయంలో ఆయన టీడీపీ తరుఫున ‘ప్రజాయాత్ర’ నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రం అంతటా సంచరిస్తున్నారు. అయితే పెళ్లికి వెళ్తే.. యాత్రకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఎన్టీఆర్ వెళ్లలేదట. ఇక వివాహ తంతు ముగియగానే బాలకృష్ణ, రామకృష్ణ ప్రజాయాత్రలో ఉన్న ఎన్టీఆర్ వద్దకు నేరుగా వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారట. అయితే ఈ విషయాలను ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్లో మురళీ మోహన్ వెల్లడించారు. గతేడాది 28 మే నుంచి ‘శక పురుషుడి శత జయంతి’ పేరిట ఉత్సవాలను బాలకృష్ణ మొదలు పెట్టారు. ఇటీవల నిర్వహించిన శత జయంతి అంకురార్పణ సభలో సూపర్స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.