
Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఆవరణలో అడుగుపెట్టాడు. నందమూరి తారకరామారావు తరహాలో ధోవతి, తెలుగింటి పంచె కట్టి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన బాలయ్య లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి నందమూరి తారకరామారావును గుర్తు చేసుకున్నారు. పంచకట్టుతో కనిపించిన బాలయ్య గర్వంతో, సంప్రదాయభరితంగా తెలుగు వారి గొప్పతనాన్ని దేశమంతా చాటి చెప్పారు. కుటుంబసభ్యులు సమేతంగా రాష్ట్రపతి భవన్కు వచ్చిన బాలయ్య, తెలుగువారి పంచెకట్టుకు గౌరవం తెచ్చారు.
బాలయ్య పంచెకట్టులో కనిపించిన దృశ్యం అభిమానులను ఫిదా చేసింది. సోషల్ మీడియా అంతా బాలయ్య ఫోటోలతో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఎన్నో దశాబ్దాలుగా సినీ రంగానికి, ప్రజాసేవకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా లభించిన అతి ప్రధానమైన గౌరవంగా చెప్పొచ్చు.