
Padma Bhushan Balakrishna : తనకు సరైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందని నటుడు బాలకృష్ణ అన్నారు. అవార్డు ఆలస్యంగా వచ్చిందనే వార్తలపై ఆయన స్పందించారు. ఆయన నటించిన ‘ఆదిత్య 369’ చిత్రం ఏ తరానికీ నచ్చుతుందని, ఇలాంటి సినిమాలు చేయడానికి చాలా మంది ప్రయత్నించినా తమ స్థాయిలో విజయం సాధించలేకపోయారని ఆయన అన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 4న తిరిగి విడుదల కానుంది.