Team 1983 Vs Punjab Cricket Club : అమెరికాలోని న్యూజెర్సీలో జరుగుతున్న బాల్ అండ్ బ్యాట్ క్రికెట్ లీగ్ టీ-20 స్ప్రింగ్ 2024 ఉత్సాహంగా సాగుతోంది. ఈ టోర్నీలో యూబ్లడ్ ఫౌండర్ డా.జై జగదీష్ బాబు యలమంచిలి గారు ‘టీం 1983’ని స్పాన్సర్ చేస్తున్నారు. జై స్వరాజ్య టీవీ అండ్ జేఎస్ డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ ఆనంద్ సహకారం అందించారు. ఈనెల 15న మొదటి మ్యాచ్ లో ‘ఎన్ జే హాక్స్’ జట్టుపై ‘టీమ్ 1983’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 16వ తేదీన ఉదయం 11.30లకు ఎడిసన్ లోని సెదార్ బ్రూక్ పార్క్ గ్రౌండ్ లో రెండో మ్యాచ్ పంజాబ్ సీసీ, టీమ్ 1983 జట్ల మధ్య జరిగింది.
మొదటి మ్యాచ్ లో దుమ్మురేపిన టీమ్ 1983..రెండో మ్యాచ్ లో సైతం విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ సీసీ జట్టులో ముస్తాఫా ఖాన్ మాత్రమే రాణించాడు. 34 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ముస్తాఫా తర్వాత ప్రభుజోత్ సింగ్ 19 పరుగులు, సుఖ్ విందర్ 16, క్రిషన్ కుమార్ 16 పరుగులు చేశారు. మొత్తంగా పంజాబ్ సీసీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేసింది.
140 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ‘టీమ్ 1983’ ఓపెనర్లు ఇరగదీశారు. ప్రతిక్ 16 పరుగులు, మహేశ్ రెడ్డి 46 పరుగులు సాధించగా.. ఇద్దరూ 62 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆతర్వాత వచ్చిన కార్తిక్, రాఘవ కల్యాణ్ నిరాశ పరిచారు. తర్వాత వచ్చిన అక్షయ్ కుమార్ 45 పరుగులతో స్కోర్ బోర్డ్ ను ఉరకలెత్తించారు. 3 ఫోర్లు, మూడు సిక్స్ లతో ప్రేక్షకులను అలరించారు. అక్షయ్ కు జోడి వెంకీ రెడ్డి 20 పరుగులు చేశారు. ఇందులో మూడు సిక్స్ లు కొట్టారు. అక్షయ్, వెంకీ ఇద్దరూ జట్టుకు ఘన విజయాన్ని అందించారు. 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి పంజాబ్ సీసీ జట్టుపై ఘన విజయం సాధించింది.
స్కోరు వివరాలు:
పంజాబ్ సీసీ ఇన్నింగ్స్:
ఓమర్ ఖయ్యూం: 8(19)
ప్రభుజోత్ సింగ్ : 19(20)
దీపక్ చౌదరీ : 0(3)
సుఖ్విందర్ సింగ్ : 16(13)
హర్సిమ్రన్ సింగ్ : 5(13)
ముస్తాఫా ఖాన్ : 60(34)
క్రిషన్ కుమార్: 16(18)
ఎక్స్ ట్రాస్: 16
టీమ్ 1983 ఇన్నింగ్స్:
ప్రతిక్ :16(11)
మహేశ్ రెడ్డి: 46(46)
కార్తిక్ నటరాజన్ : 1(5)
రాఘవ కల్యాణ్ : 0(3)
అక్షయ్ కుమార్ : 45(29)
వెంకీ రెడ్డి : 20(13)
ఎక్స్ ట్రాస్ : 13
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya TV & JSW Tv Global Director)
More Images :Team 1983 Vs Punjab Cricket Club at Cedar Brook Park Plainsboro NJ