
Indian-2 : కమల్ హాసన్ హీరోగా తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా ‘భారతీయుడు 2’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్ర పోషించింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రకుల్ తన పాత్ర గురించి వివరించింది.
‘నా సినీ కెరీర్లో ‘ఇండియన్-2’ బెస్ట్ మూవీ అవుతుంది. ఇందులో నా పాత్ర అంత గొప్పగా ఉంటుంది. రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటుంది. ఇందులో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న మహిళగా కనిపిస్తాను. ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర నాకు దొరకలేదు. షూటింగ్ గొప్ప అనుభూతినిచ్చింది. శంకర్ లాంటి అగ్ర దర్శకులతో పనిచేయడం అదృష్టం. ఈ సినిమా విశేషాలను పంచుకోవాలని ఆసక్తిగా ఉంది.’ అని అన్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే నెల (జులై) 12న విడుదల కానుంది. 1996లో వచ్చిన భారతీయుడు సంచలనం సృష్టించింది. అందులో సేనాపతి పాత్రలో కమల్ ఆహార్యం, నటన విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది రిలీజైన వెంటనే ‘భారతీయుడు 3’ పనులను మొదలు పెట్టనున్నారు.
‘ఇండియన్2’లో మనీషా కొయిరాల
భారతీయుడు 2లో కమల్ హాసన్తో పాటు సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో మనీషా కొయిరాలా కూడా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం శంకర్తో ఆమె దిగిన ఫొటోనే. భారతీయుడిలో హీరోయిన్ గా చేసిన మనీషా గెస్ట్ పాత్రలో కనిపిస్తుందని టాక్.