33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Eluru District : వైసీపీ గెలుస్తుందని పందెం.. రూ.30 కోట్లు చెల్లించలేక ఆత్మహత్య

    Date:

    Eluru District
    Eluru District

    Eluru District : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని సుమారు రూ.30 కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో ఆదివారం జరిగింది.

    పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచి. వీరు వైసిపి మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని వేణుగోపాలరెడ్డి వివిధ గ్రామాలకు చెందినవారితో సుమారు రూ.30 కోట్ల వరకు పందెం వేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడం.. గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7న పందెం వేసినవారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు, తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు.

    ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుమందు తాగారు. మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్లు మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kolleru : కొల్లేరు ఉగ్రరూపం.. రహదారులపైకి వరదనీరు

    Kolleru : ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద భారీగా పెరిగింది. రామిలేరు,...

    Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఊహించని పదవులు..

    Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు...

    YSRCP : గెలిస్తే సక్రమం.. ఓడితే అక్రమం.. ఇది వైసీపీ తీర్పు 

    YSRCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో అసెంబ్లీ ఎన్నికలు...

    Pawan Kalyan-Balayya : పవన్ కు బాలయ్యకు ఎవరికీ మెజార్టీ ఎక్కువో..

    Pawan Kalyan-Balayya : పవన్ కల్యాణ్, బాలకృష్ణ, మార్గాని భరత్, లోకేశ్...