
Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని కోవెల ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో బుధవారం లెక్కించారు. 51 రోజులకు గాని రూ.1,68,54,129 ఆదాయం వచ్చినట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. అంతేగాక 117 గ్రాముల బంగరం, 1,300 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ.. యూఎస్ 557 డాలర్లు, ఖతార్ రియాల్స్ 5, ఇంగ్లండ్ పౌండ్స్ 20, ఫిలిప్పీన్స్ పీసూ 20, నేపాలీస్ రుపీ 950, యూఏఈ దిర్హామ్స్ 20, మలేసియా రింగెట్స్ 14, ఆస్ట్రేలియన్ డాలర్లు 60, కెనడా డాలర్లు 20 సమకూరాయి.
వేసవి సెలవులు కావడంతో ఏప్రిల్, మే నెలల్లోనే కాక ఈ నెలలో గత ఆదివారం వరకు భక్తులు పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి వచ్చారు. అలాగే హనుమాన్ జయంతి కూడా కావడంతో మాలధారులు విరమణకు రామయ్య సన్నిధికి చేరుకున్నారు. దీంతో భద్రగిరి రద్దీగా మారగా.. హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది.