
Railway passengers : విజయవాడ, హైదరాబాద్ వెళ్లే రైల్వే పాసింజర్లకు ముఖ్య గమనిక. బుధవారం ఉదయం 3 గంటల 35 నిమిషాలకు తాడి-అనకాపల్లి మార్గంలో బొగ్గు లోడ్తో వస్తోన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతిందని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ కారణంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు పాసింజర్ రైళ్ళు.. ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు పేర్కొంది.
ఈ జాబితాలో జన్మభూమి ఎక్స్ప్రెస్.. విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్.. రత్నాచల్.. ఉదయ్ ఎక్స్ప్రెస్లను ఈరోజు రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖపట్టణానికి వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్ జూన్ 15న కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడువనుంది.
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనులతో విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్ల రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే పేర్కొంది. విశాఖ-రాజమహేంద్రవరం(07467), రాజమహేంద్రవరం-విశాఖ(07466), కాకినాడ-విశాఖ(17267) ఎక్స్ప్రెస్, విశాఖ-కాకినాడ(17268) ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 18వ తేదీ వరకు రద్దు చేసినట్లు వెల్లడించింది.






