Pakistan: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ ప్రతీకార చర్యకు సిద్ధమవుతుందనే సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, శీనగర్, అమృత్ సర్, లుథియానా, చండీగఢ్ సహా పలు నగరాల్లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు ప్రయత్నించగా.. భారత్ సక్సెస్ ఫుల్ గా అడ్డుకుందని జాతీయ మీడియా తెలిపింది. భారత్ లోని 15 నగరాల్లో సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన బీవీర్ మిస్సైల్స్ తో దాడులు చేసేందుకు యత్నించింది. దీన్ని భారత్ లోని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. పాక్ ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టింది. దీంతో… పాక్ యుద్ధానికి సిద్ధమైనట్లేనని నిపుణులు అంటున్నారు.