ప్రస్తుతం రాజకీయాలు అమెరికా కేంద్రంగా తిరుగుతున్నాయి. జూన్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండగా అదే నెలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమెరికాలో ర్యాలీ చేపట్టనున్నారు. ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో బీజేపీ కూడా అందుకనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు ఉపక్రమించింది.
పార్టీ నేత, ఎమ్మెల్సీ రాంచందర్ రావును అమెరికా పంపిస్తోంది. ఆయన ఆరు రాష్ట్రాల్లో పర్యటించి ప్రసంగించనున్నారు. మే 30న వాషింగ్టన్, మే 31న వర్జీనియా, మేరీ ల్యాండ్, జూన్ 1న అట్లాంటా, జూన్ 2న డల్లాస్, జూన్ 3న పార్లెట్, జూన్ 4న జూన్ 4న రాలీ, జూన్ 6న న్యూజెర్సీలో సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలు, బీజేపీ ఉద్దేశాలు ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన బయలుదేరి వెళ్లారు. అమెరికా పర్యటనలో పార్టీ గురించి ప్రచారం చేయనున్నారు. రాజకీయాలు దేశ సరిహద్దులు దాటుతున్నాయి. పార్టీల వైఖరులు మారుతున్నాయి. తమ పార్టీ విధానాలు విదేశాల్లో సైతం బాగుండాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రవాసులను భాగస్వాములను చేయనున్నారు.
ఓ పక్క నరేంద్ర మోడీ, మరో పక్క రాహుల్ గాంధీ. ఇటు రాంచందర్ రావు ముగ్గురు రెండు పార్టీల గురించి ప్రచారం సాగించనున్నారు. రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించనున్నరు. కర్ణాటకలో లభించిన విజయంతో పార్టీని గురించి ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి వారికి పార్టీ ఉద్దేశాల గురించి తెలియజేయనున్నారు.