పుష్ప-1 భారీ విజయం తర్వాత పుష్ప-2 షుటింగ్ లో బీజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప-2కు సంబంధించి ట్రైలర్ ఇప్పటికే విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ట్రైలర్ బాగా కట్ చేశారంటూ వ్యూవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ షుటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అయ్యేందుకు ఇంకా ఏడాది పట్టేలా ఉంది. 2024 సమ్మర్ వరకు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని చిత్ర యూనిట్ హింట్ ఇస్తుంది.
ఇదిలా ఉండగా బన్నీ తర్వాత ప్రాజెక్టు ఎవరితో అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగతో తను ఒక సినిమా తీయబోతున్నట్లు అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఏప్పుడు ముహూర్తం షాట్.. సినిమా పేరేంటి కాస్ట్ ఏంటి అనేదానిపై ఇంకా తెలియాల్సి ఉంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘యానిమల్’ సినిమా షుటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యాక స్పిరిట్ సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఇది పూర్తయిన తర్వతగానీ బన్నీతో ప్రాజెక్టు మొదలు పెట్టవచ్చు అంటూ ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డితో సినిమాకు టైం పడుతుండడంతో అంత వరకూ ఆయన మరో స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దాదాపుగా ఇది ఫైనల్ అనుకుంటుండగా మరో డైరెక్టర్ తో చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఆయనే త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే త్రివిక్రమ్-బన్నీ కాంబోలో మూడు బ్లాక్ బస్టర్లు వచ్చాయి.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు భారీ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు. ఇప్పుడు ఇదే కాంబోలో చిత్రం కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీస్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ తో ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. అటు తర్వాత గానీ బన్నీతో మొదలు పెట్టరు.