27.5 C
India
Thursday, August 13, 2026
More

    AP: టీడీపీ నేతలపైనే కేసులు.. వైసీపీ నేతలు సేఫ్

    Date:

    TDP vs YCP
    TDP vs YCP

    AP: ఏపీలో పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే ప్రతిపక్ష నేతల ఆరోపణలను వారు నిజం చేసి చూపిస్తున్నారు.  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించి, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వారిని వదిలేసి ఏకంగా టీడీపీ నేతలందరిపై పోలీసులు కేసులు నమోదు చేయడం చూస్తుంటే అందరికీ ఇదే అర్థమవుతున్నది. వైసీపీ నేతలను మాత్రం సేఫ్ గా పంపించారని, కేసులు కూడా నమోదు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు లో ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    అల్లర్లపై కురుబలకోట మండలం ముదివీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ ఘటనలో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, ఏ3 గా అమర్నాథ్ రెడ్డి, ఏ4 రాంగోపాల్ రెడ్డిగా పేర్కొన్నారు వారితోపాటు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, తుమ్మలపాటి రమేషశ్, గంట నరహరి, శ్రీరామ్ చిన్నబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు నమోదు చేశారు మరికొందరు నేతల పైన కూడా కేసు నమోదు చేశారు. ఉమాపతి రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

     దీంతోపాటు ములకలచెరువు పోలీస్ స్టేషన్ లోనూ టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు షో లో భాగంగా చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్త చాంద్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ 7గా పేర్కొన్నారు. మరికొందరు తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వైసీపీ శ్రేణులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రవర్తిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఎన్నికల సమయంలో ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి మాత్రమే పని చేస్తుందని ప్రజలకు ప్రతిపక్షాలకు కాదని మండిపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన.. వైరల్

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...

    Janasena : జనసేనలోకి రావొద్దు..!

    Janasena : జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి...