
Hyderabad : హైదరాబాద్ రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్ లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీకెండ్ మత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు తేల్చారు. సైకడిక్ట్ పార్టీలో డీజే గౌరవ్ 80 డెసిబుల్స్ సౌండ్ మించి శబ్దంతో హోరెత్తించారని నిర్ధారించారు. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు పోలీసులు తేల్చారు.
పట్టుబడ్డవారంతా రెండు రోజులుగా డీజే ఆర్టిస్ట్ గౌరవ్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. గౌరవ్ తో కోడ్ లాంగ్వేజీలో డ్రగ్స్ కొరకు కస్టమర్స్ చాటింగ్స్ చేశారని పోలీసులు నిర్ధారించారు. డీజే గౌరవ్ కు హైదరాబాద్ లో ప్రముఖుల కాంటాక్ట్సె పై విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు పార్టీలో 26 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పబ్ ఓనర్స్ ముగ్గురిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో పెద్దవారు ఎవరైన ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.