
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.
2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం బాబు హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు వైస్ జగన్ సిట్ ఏర్పాటు చేశారు. దీనిపై చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై స్టే మంజూరు చేసింది హైకోర్టు. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేసింది. దీంతో బాబుకు మరన్ని కష్టాలు మొదలయ్యాయి.
అమరావతి భూముల 2050 ఎకరాల భూమి విషయంలో అవినీతి జరిగిందని వైసీపీ ప్రధాన అరోపణ, అమరావతి రాజదాని అవుతుందని కొంత మంది టీడీపీ నాయకులకు ముందే తెలుసు అని వాళ్లకి తెలిసే వాళ్లు అక్కడ భూములు కొన్నారు. వాళ్లు అనంతపురం వివిధ ప్రాంతాలలో భూమి అమ్ముకుని మరి కొన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని దీనిపై విచారణ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
మిగితా విషయాలలో బాబు తప్పించుకున్నా.. స్కిల్ డెవలప్ కింద సీమాన్ సంస్థ కింద 370 కోట్లు విడుదల చేయడం జరిగింది. అందులో కేంద్రం 90 శాతం రాష్ర్టం 10 శాతం భరిస్తుంది. అయితే 3070 కోట్లకు గాను 370 కోట్లు సీమాన్ సంస్థకు సెక్షన్ ఆపీసర్ బదిలీ చేశారు. అయితే సీమాన్ సంస్థ ఒప్పందమే జరగలేదని సీమాన్ సంస్థ వాదిస్తోంది. చంద్రబాబు చెప్పరని సీఎస్ తనతో చెప్తె డబ్బులు రీలిజ్ చేశామని చెప్తున్నారు. అప్పటి సీఎస్ కూడా చంద్రబాబు డబ్బులు రీలిజ్ చేయమన్నాడని వారిస్తున్నారు. అయితే ఇందులో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా ఉందని సిట్ భావిస్తుంది. ముందుగా సెక్షన్ ఆఫీసర్, అప్పటి సీఎస్ ను విచారిస్తే గా పూర్తి వివరాలు సిట్ కు చెప్తె చంద్రబాబు అరెస్ట్ తప్పదని భావిస్తున్నారు.






