34.7 C
India
Sunday, March 16, 2025
More

    Chandrababu Naidu : బీజేపీ కోసం ఢిల్లీకి చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం కోసం పెద్ద స్కెచ్

    Date:

    Chandrababu Naidu
    Chandrababu Naidu

    Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే పొత్తు కింద బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ఢిల్లీలోని తెలుగువారున్న ప్రాంతాల్లో బీజేపీ మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్‌తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం ఎంపీలతో కలిసి చంద్రబాబు అధికారికంగా బీజేపీ తరఫున ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.

    ఇదిలా ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ తమ తమ అగ్రనాయకులను ప్రచారానికి దింపుతూ ప్రజల మద్దతును సంపాదించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలుండటంతో ప్రచారం మరింత ఉత్కంఠభరితంగా మారింది. అన్ని ప్రధాన పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ తమ పార్టీ విధానాలను ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు తమ మ్యానిఫెస్టోలు ప్రకటిస్తూ, ఎన్నికల ప్రణాళికలను వివరించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.

    ఇక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్థులుగా ప్రకటించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 27న జరిగే ఈ ఎన్నికల్లో వారిని భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని నేతలకు సూచించారు.

    Share post:

    More like this
    Related

    Revanth Reddy : రెండోసారి నేనే సీఎం.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

    Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తానే ముఖ్యమంత్రి...

    Jana Sena : జనసేన సభ నుంచి తిరిగి వెళుతూ కార్యకర్త మృతి… పవన్ కల్యాణ్ స్పందన

    Jana Sena Meeting : నిన్న జనసేన సభకు హాజరైన అడపా దుర్గాప్రసాద్ సభ...

    Mughal emperors : దుర్భర పరిస్థితుల్లో మొఘల్ చక్రవర్తుల వారసులు

    Mughal emperors : భారతదేశాన్ని పాలించిన మొఘల్ సామ్రాజ్యం ఒకప్పుడు ఎంతో వైభవంగా...

    Vijaya Sai : రాజు రాజ్యం కోటరీ : స్వరం పెంచిన విజయసాయి

    Vijaya Sai : పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jana Sena : జనసేన సభ నుంచి తిరిగి వెళుతూ కార్యకర్త మృతి… పవన్ కల్యాణ్ స్పందన

    Jana Sena Meeting : నిన్న జనసేన సభకు హాజరైన అడపా దుర్గాప్రసాద్ సభ...

    Holi Milan : బీజేపీ నేతల హోళీ మిలన్ కార్యక్రమం.. పాల్గొన్న ‘పాతూరి’ గారు

    Holi Milan program : మాజీ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి...

    MLCs in AP : ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

    MLCs in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు...

    Hayagriva : హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు

    Hayagriva Lands  : విశాఖపట్నంలో వైకాపా ప్రభుత్వ భూ అక్రమాలపై కఠిన నిర్ణయం...