
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన వివాదాస్పద ఐపీఎస్ కు అుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. విజయంతో మర్యాద పూర్వకంగా కలుస్తామని రాగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
బాబును కలిసేందుకు సీఐడీ చీఫ్ సంజయ్ వచ్చారు. కానీ, కరకట్ట గేటు వద్దే కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపి వెనక్కి పింపించారు. బాబుపై అక్రమ కేసులు నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అయితే, ఫలితాల్లో బాబు విజయం సాధించడంతో సెలవు పెట్టి విదేశాలకు వెళ్లాలని సీఐడీ చీఫ్ సంజయ్ అనుకున్నారు. కానీ అందుకు బాబు అంగీకరించకపోవడంతో సెలవు క్యాన్సిల్ చేశారు. మర్యాద పూర్వకంగా కలిసేందుకు సంజయ్ వచ్చాడని విషయాన్ని అధికారులకు గేటు సిబ్బంది చెప్పారు. అనుమతి లేదని చెప్పడంతో వెనక్కి పంపారు.
మరో అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు గురువారం (జూన్ 06) ఉదయం ఉండవల్లిలోని బాబు నివాసం వద్దకు వచ్చారు. ఆయనకు కూడా చంద్రబాబు అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఈసీ ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో పాటు అనధికారికంగా వైసీపీకి కోసం పనిచేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బాబు నివాసం ప్రధాన గేటు వద్దే పీఎస్ఆర్ కారు సిబ్బంది ఆపారు. అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.
మరో సీనియర్ ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డికి కూడా అనుమతి ఇవ్వలేదు. అనుమతి కోసం సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా తిరస్కరించారు. నంద్యాలలో బాబు అరెస్ట్ సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వైసీపీకి విధేయుడిగా పని చేశారంటూ ఈసీ కొరఢా ఝుళిపించింది. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది.
గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్రెడ్డిదీ ఇదే పరిస్థితి వైసీపీకి తొత్తుగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. బాబును కలిసేందుకు వెళ్లగా అనుమతి లేదని పోలీసులు ఆయన కారును ఆపారు. దీంతో వెనుదిరిగారు.