
Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీతో రికార్డు స్థాయి కలెక్షన్లతో మరో మారు తన సత్తా ఎంటో నిరూపించుకున్నారు. తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. పురాణాలు, సైన్స్ ఫిక్చన్ రెండింటి కలయికతో ఈ మూవీకి సరికొత్త ఉందని ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీలో స్టార్లకు కొదవ లేదు.
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు, మాళవిక, సీనియర్ నటి శోభన నటించిన ఈ మూవీని ప్రజలు ఆదరిస్తున్నారు. మహా భారతంలోని అంశాలను టచ్ చేయడంతో కల్కి మూవీ నెక్ట్స్ లెవల్ లోకి వెళ్లిపోయింది.
అయితే కల్కి మూవీ రాకతో థియేటర్లు చాలా రోజుల తర్వాత జనాలతో సందడిగా కనిపిస్తున్నాయి. కుటుంబ సమేతంగా కల్కికి ప్రజలు తరలివస్తుండటంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. కల్కి మూవీ ఇప్పటికే 9 రోజుల్లోనే 800 కోట్లకు పైగా కలెక్షన్ చేసి 1000 కోట్ల వైపు దూసుకెళుతుంది. వైజయంతీ మూవీస్ లో నిర్మించిన ఈ మూవీపై నిర్మాత అశ్వినీ దత్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ విజయంతో ఆయన కలలు నిజమయ్యాయి.
అయితే కల్కి విజయంతో ప్రభాస్ మరోసారి తన మార్కును చూపించారు. ప్రభాస్ కు బాహుబలి తర్వాత కెరీర్ అసలేం మాత్రం బాగుండదని జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పారు. అదే విధంగా సాహో, రాధే శ్యాం, ఆదిపురుష్ లు అంతంత మాత్రంగానే ఆడాయి. అయితే కలెక్షన్లు బాగానే వచ్చినా నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో వేణు స్వామి ఇంకా ఆగలేదు. చెప్పింది నిజమైందన్నట్లు విర్ర వీగాడు.
అయితే సలార్ గ్రాండ్ సక్సెస్ కావడం, ఇప్పుడు కల్కి మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుండటంతో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా వేణు స్వామి కి కౌంటర్ ఇచ్చారు. ఎవరో జ్యోతిష్యులు ప్రభాస్ కెరీర్ లో విజయాలే దక్కవన్నారు. వారు మరి సలార్, కల్కి మూవీ గురించి విన్నారో లేదో అని చురకలంటించారు. ముందు నీ జాతకం సరిగా ఉందో లేదో చూసుకో అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వేణు స్వామి ని ఒక ఆట ఆడుకుంటున్నారు.