29.3 C
India
Tuesday, February 10, 2026
More

    CM YS Jagan : ఆ అధినేతల్లో టెన్షన్.. సీట్ల పంపకాలు తేలేనా..?

    Date:

    AP CM Ys Jagan
    AP CM Ys Jagan
    CM YS Jagan : ఏపీలో ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయం ఉందని సీఎం జగన్ ప్రకటించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని, సమయానికే ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. అయితే వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి నిలవాలని యోచిస్తున్నది. వీలైతే కేంద్రంలోని బీజేపీ సాయం తీసుకోవాలని మాత్రం భావిస్తున్నది. బీజేపీని టీడీపీ వైపు వెళ్లకుండా చూసేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నది.

    అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల అంశంపై మాత్రం ఏపీలో చర్చ కొనసాగుతున్నది. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే స్పష్టంగా పొత్తులపై ప్రకటన చేశాయి. మరి బీజేపీ ఎటూ తేల్చడం లేదు. అయితే టీడీపీ, జనసేన పార్టీల్లో సీట్లు సర్దుబాటు అంశం కొంత చర్చనీయాంశమవుతున్నది. జనసేన 30 నుంచి 40 సీట్లు అడిగే అవకాశమున్నదని టాక్ బయటకు వస్తున్నది. ఇక్కడే అసలు కథ మొదలు కాబోతున్నది. ఇన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా లేరు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్ధులను టీడీపీ ఖరారు చేసింది. మరికొన్ని చోట్ల త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతన్నది. అయితే ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి చోట్ల అభ్యర్థుల ఖరారు కొలిక్కి వస్తుందా అనేది సందేహాంగానే కనిపిస్తున్నది. ఇరు పార్టీలు పట్టుకు పోతే మొదటి కే మోసం వచ్చేలా కనిపిస్తున్నది. అయితే అధినేతలు మాత్రం పొత్తు ఉంటుందని చెబుతున్నారు. అయితే వారి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని కొంత మంది భావిస్తున్నారు. అయితే కొన్ని సీట్ల పైనే ఇప్పుడు స్పష్టత రావడం లేదు. టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నచోట జనసేన పట్టుపడితే ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విజయవాడ సెంట్రల్ సీటు ఇప్పుడు రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉండబోతున్నది. అక్కడ ఇప్పటికే టీడీపీ బొండా ఉమను ప్రకటించింది. అయితే ఇక్కడి నుంచి వంగవీటి రాధా కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు.  సత్తెనపల్లిలో జనసేన కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ, కొడెల శివరాం ఉన్నారు.  తెనాలి అంశం కూడా కొంత టఫ్ గానే ఉంది. అయితే అక్కడ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. నాదెండ్లకు ఎమ్మెల్సీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్ చేయబోతున్నదని సమాచారం.

    పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గాల్లో ఉండి కొందరు నాయకులు పోరాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తమను వేధిస్తున్నా, కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నా రెండు పార్టీల్లో పలువురు నాయకులు పార్టీనే నమ్ముకొని అన్నీ భరిస్తున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ ఇతరులకు ఖరారైతే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల రెబెల్స్ బెడద తప్పేలా లేదు. అయితే అధినేతలు పిలచి మాట్లాడితే కొందరు చల్లబడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తు న ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు ఈసారి గట్టిగా ఆశ పెట్టుకున్నవారితోనే ఇప్పుడు ఇరు పార్టీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది . మరి ఇలాంటి సమయంలో అధినేతలకు తలనొప్పి తప్పేలా లేదు. ఇరువురు పంతానికి పోతే మళ్లీ వైసీపీ ఖాతాలోకి అధికారం వెళ్లిపోతుంది. మరోవైపు ఒకడుగు తగ్గేందుకు, త్యాగాలు చేసేందుకు సిద్ధమని ఇరు పార్టీల నేతలు కొందరు ప్రకటిస్తున్నా, ఆఖరు నిమిషం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అయితే టీడీపీ ఓటు బ్యాంక్ వారితోనే ఉంది. మరి జనసేన కూడా కలిస్తే వారికి విజయం సునాయసమవుతుంది. ఇలాంటి సమయంలో సీట్ల పంపకాలు అనుకున్నట్లు సరిగ్గా పూర్తయితేనే ఇక తిరుగుండదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Govt : ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

    AP Govt : కేంద్రం ఏపీకి శుభవార్త చెప్పింది.. కొత్తగా చేనేతల...

    Rain Effect: మరో ఆరు రోజులు ఇదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వర్ష గండం..

    Rain Effect: రెండు రోజులుగా తీవ్ర వర్షం కురుస్తుండడంతో రెండు తెలుగు...

    Nirmala Sitharaman : అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

    Nirmala Sitharaman : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో...

    Peddavagu : పెద్దవాగు ఖాళీ.. వేల ఎకరాల్లో ఇసుక మేటలు

    Peddavagu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలలోని పెద్దవాగు ప్రాజెక్టుకు...