29.3 C
India
Tuesday, February 10, 2026
More

    BRS MLA Durgam Chinniya : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై సీబీఐకి ఫిర్యాదు… విచారణ చేపట్టాలని మహిళా విన్నపం..!

    Date:

     

     

    BRS MLA Durgam Chinniya : తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కొంతకాలంగా ఆరిజన్ డెయిరీ సీఈవో సేజల్ ఆరోపణలు చేస్తున్నారు. వీరి అంశం జిల్లాతో పాటు రాష్ర్ట రాజకీయాల్లో సంచలనంగా మారింది. దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని, డెయిరీ వ్యాపారాన్ని దెబ్బతీశాడని సేజల్ తీవ్రంగా ఆరోపిస్తున్నది. బిజినెస్ మీటింగ్ అని పిలిచి మందు పార్టీ ఏర్పాటు చేశారని, ఎమ్మెల్యే క్వార్టర్ లోనే తాము కలుసుకున్నామని తెలిపింది. అయితే తన వద్ద ఉన్న ఆధారాలను స్థానిక పోలీసులు డిలీట్ చేశారని కూడా ప్రకటించి, సంచలనం సృష్టించింది. ఇంకా ఆధారాలు ఉన్నాయని పేర్కొంది

    అయితే సేజల్ ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆత్మహత్యాయత్నం చేసింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నాడని పేర్కొంది. న్యాయం కోసం ఇటీవల జాతీయ మహిళా కమిషన్ ను కూడా సంప్రదించింది. అయితే తాజాగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పూర్తి విచారణ చేపట్టాలని కోరింది. అరిజన్ డెయిరీ ఏర్పాటు విషయంలో కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తనను వేధిస్తున్నట్టు సేజల్ పదే పదే ఆరోపణలు చేస్తున్నది. అయితే సేజల్ పై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. డెయిరీ ఏర్పాటు పేరుతో రైతులను మోసగించారనే ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

    మరోవైపు దుర్గం చిన్నయ్య వ్యవహారంపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గాఉన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తలనొప్పి పార్టీకి చిక్కుకుంటే ప్రమాదమని భావిస్తున్నది. ఇక దుర్గం చిన్నయ్యకు టికెట్  కష్టమేననే కథనాలు వస్తున్నాయి. ఆయనపై ఇప్పటికే ఫిర్యాదులు ఉన్న క్రమంలో బెల్లంపల్లిలో కొత్త అభ్యర్థి ఎంపికపై పార్టీ దృష్టి పెట్టినట్లు టాక్. దుర్గం చిన్నయ్య వ్యవహారం పార్టీకి తలనొప్పిలా మారిందని, ఇది జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే మాత్రం తనకు సేజల్ తో ఎలాంటి సంబంధం లేదని, తన ప్రత్యర్థులే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని చెబుతున్నారు. రైతులను మోసం చేస్తున్నందునే అరిజన్ డెయిరీపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుపుతున్నారు. అయితే ఈ వివాదం మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ఈ విషయంలో ఆమె ఏకంగా రాష్ర్ట పోలీసులపై కూడా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. రాష్ర్ట పోలీసులపై నమ్మకం లేకే ఆమె సీబీఐని కలిసిందని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. మరి ఇక దుర్గం చిన్నయ్య కు గండం తప్పేలా లేదు. ల

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related