Viral News : కర్ణాటక ఆర్టీసీ బస్సులు చిలుకలకు టికెట్ కొట్టిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఓ మహిళ తన మనవరాలు తో కలిసి బెంగళూరు నుంచి మైసూరు కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. నాలుగు చిలుకలను ఆమె వెంట తీసుకొచ్చింది.
శక్తి పథకంలో భాగంగా వారికి ఫ్రీ టికెట్ ఇచ్చిన కండక్టర్ చిలుకలను మాత్రం బాలలుగా పరిగణిస్తూ 444 రూపాయల చార్జీని వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
చిలుకలకు టికెట్ కొట్టడం ఏంటి అని పలువురు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పెద్దవారికి టికెట్ కొట్టిన విధంగా పక్షులకు టికెట్ కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పక్షులను బాలలుగా ఎలా పరిగణిస్తారని ఆ రాష్ట్రంలో ఏంటి ఈ వింత అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చిలుకలకు టికెట్ కొట్టిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగా మారుతుంది.