
పేగులు శుభ్రం కాకపోవడం, మలినాలు పేరుకుపోవడం వల్ల కడుపు కీకారణ్యంగా మారుతుంది. తిన్న పదార్థాలు జీర్ణం కాకపోతే మనకు దుష్ర్పభావాలు కలుగుతాయి. ఈ బాధల నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. సులభంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ చిట్కా ఉంది. దాన్ని పాటించి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో నీళ్లు పోసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసుకోవాలి. చిన్న మంటపై 5-10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. తరువాత వాటిని వడకట్టుకోవాలి. తరువాత ఇందులో టీ స్పూన్ ఆముదం నూనెను అర చెక్క నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. దీన్ని ఉదయం పరగడుపున గోరువెచ్చగా తాగాలి. నీరు తాగడానికి ముందు రెండు గ్లాసుల సాధారణ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా నీటిని తాగిన అరగంట తరువాత సోంపు గింజల నీటిని తాగాలి.
ఇలా ప్రతిరోజు తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. కడుపులోని కొవ్వు పోతుంది. పొట్ట క్లీన్ గా మారుతుంది. ఇలా మనం ఈ పరిహారం చేసుకుంటే మనకు అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టలో కొవ్వు పేరుకుపోతే చెత్తగా మారుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.






