23 C
India
Wednesday, August 12, 2026
More

    Pithapuram Constituency Review : నియోజకవర్గ రివ్యూ: పిఠాపురంలో గెలుపెవరిది..?

    Date:

    Pithapuram Constituency Review
    Pithapuram Constituency Review

    వైసీపీ: పెండెం దొరబాబు(ప్రస్తుత ఎమ్మెల్యే)
    టీడీపీ: ఎస్వీఎస్ఎన్ వర్మ
    జనసేన: పిళ్ల శ్రీధర్
    ఓటర్లు:2.30లక్షలు

    Pithapuram Constituency Review ఏపీలోని గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. మొత్తంగా 2.30 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. గత రెండు సార్లు ఇక్కడ వైసీపీ గెలిచింది. అయితే పిఠాపురంలో గెలిచిన పార్టీ రాష్ర్టంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ గతంలో ఉండేది. కానీ 2019లో వైసీపీ ఈ సీటును గెలుచుకొని రాష్ర్టంలో అధికారంలోకి కూడా వచ్చింది. గత సెంటిమెంట్ ను తుడిచి పెట్టింది.

    ఇక 2024లో పిఠాపురంలో పోటీ రసవత్తరంగా ఉండబోతున్నదనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఈసారి పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. పిఠాపురంలో పవన్ గనుక బరిలోకి దిగితే ఇక రాష్ర్టంలో కీలక నియోజకవర్గం కానుంది. అందరి చూపు ఆ నియోజకవర్గం వైపు మళ్లే చాన్స్ ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ, వైసీపీల నుంచి బలమైన అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు ఎంవీఎస్ఎన్ వర్మ. మరోవైపు ప్రభుత్వం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ద్వారా మరోసారి ఫ్యాన్ గాలి వీయడం ఖాయమని పెండెం దొరబాబు ధీమాతో ఉన్నారు. సంక్షేమ పథకాలు, సామాజిక వర్గం వైసీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశంఉంది.

    ఇక పార్టీల పొత్తుల అంశంలో జనసేన కూడా ఈ సీన్ లోకి వచ్చింది. జనసేన నేత పిల్లా శ్రీధర్ కూడా ఈ పోటీ చేయాలని భావిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడితే తాము కలిసి గెలిపించుకుంటామని చెబుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడ పోటీకి జనసేన సిద్ధమవుతున్నది. మరోవైపు పొత్తుల అంశం నేపథ్యంలో ఇక్కడ నుంచి జనసేన, టీడీపీలో ఏదో ఒక అభ్యర్ధి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పవన్ బరిలోకి దిగాలనుకుంటే టీడీపీ ఈ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉంటుంది. కాపుల ఓటు బ్యాంక్ బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ఇక నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే మరోసారి గెలిపిస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దోరబాబు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సారి పోరు రసవత్తరంగా ఉండబోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మూడు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తూ, విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఓ టీడీపీ కార్యకర్త ఆవేదన.. వైరల్

    GV Reddy : జీవీ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరించిన...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...

    Janasena : జనసేనలోకి రావొద్దు..!

    Janasena : జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి...