Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాలాసోర్ జిల్లాలో హవా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వేస్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంతో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చెన్నై నుండి హౌరా వెళ్తుండగా కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం జరిగింది.. స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలుని ఢీ కొట్టిన కోరమండల్ ఎక్స్ప్రెస్.
ఈ ఘటనలో దాదాపు 300 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు సమాచారం. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గాయపడిన 47 మందిని బాలాసోర్లోని మెడికల్ కాలేజీలో చేర్చారు. బాలాసోర్ మెడికల్ కాలేజీ నుండి పంపిన వైద్యులు, 20 మంది ఇంటర్న్లు , 24 మంది ఇతర డాక్లు ఎంసీ, పెరిఫెరీ , డీహెచ్.హెచ్ నుండి ప్రమాద స్థలానికి తరలించారు.
ఒరిస్సా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్లో ఘటన జరిగింది.. పల్టీలు కొట్టిన 7 బోగీలు. చెల్లాచెదురుగా పడిన ప్రయాణికులు. ప్రయాణికుల కోసం ఎమర్జెన్సీ నెం. 06782-262286 గా అధికారులు కేటాయించారు.