
Delhi Assembly Elections : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.
ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఢిల్లీలో 33.31 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రముఖ నాయకులు, సహా రాహుల్ గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్యన సాగింది. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.






