
YCP Office : తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఈరోజు (శనివారం) ఉదయం 5.30 గంటల నుంచే పోలీసుల సమక్షంలో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ వెళ్లకుండా గేట్లు వేసి భారీగా పోలీసులను మోహరించారు.
కూల్చివేతకు సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైసీపీ నిన్న హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశించింది. వైసీపీ న్యాయవాది సీఆర్డీఏ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలను తెలియజేశారు. అయినప్పటికీ కూడా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయం భవనాన్ని కూల్చివేసి కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు హైకోర్టు దృష్టికి తీసుకెళామని పేర్కొంటున్నారు.