
Dharani Update : హైదరాబాద్: ధరణిలో లోపాలు సామాన్యుడి గొంతు కోస్తున్నాయి. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ప్లాట్ల రిజిష్ట్రేషన్లను పట్టించుకోకుండా కేవలం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ధరణి పోర్టల్లో అప్డేట్ చేయడంతో చాలా మంది ఇళ్ల పాట్ల యజమానులు అన్యా యమైపోయారు. దశాబ్దాల క్రితం ప్లాట్లు కొను క్కున్న సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ధరణి ఆవిర్భావం నుంచి జరుగుతున్న ఈ తమాషాకు తాజాగా హైదరా బాద్లోని హయత్నగర్ సమీపంలో జరిగిన భూ దందా చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.






