Boon for diabetics : మనది వ్యవసాయ దేశం. వ్యవసాయమే ఆధారంగా ఉంటుంది. అందుకే రకరకాల పంటలు వేస్తున్నారు. ఇందులో ఆహార పంటలు, వాణిజ్య పంటలు, ఔషధ పంటలు కూడా ఉంటాయి. ఆహార పంటల్లో వరి, గోధుమ వంటివి ఉన్నాయి. వాణిజ్య పంటల్లో పత్తి, మొక్కజొన్న, ఔషధ పంటల్లో తులసి, కలబంధ, అశ్వగంధ వంటి పంటలు పండిస్తున్నారు. దీంతో రైతులకు లాభం కలుగుతుంది.
ఔషధ పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి తక్కువ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇవి అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఔషధ పంటలు పండించడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ. దీని వల్ల వీటిని సాగు చేసేందుకు ముందుకు వస్తే ఎలాంటి నష్టం ఉండదు. ప్రభుత్వం కూడా ఔషధ పంటలకు ప్రోత్సాహం కల్పిస్తోంది.
ఔషధ పంటల్లో ముఖ్యమైనది తులసి. ఇందులో యూజినాల్ మిథైల్ పిన్నమేట్ ఉంటుంది. పలు రకాల రోగాలకు ఇది మందులా ఉపయోగపడుతుంది. ఒక హెక్టారులో పంట పండించడానికి రూ. 15 వేలు ఖర్చవుతుంది. మూడు నెలల తరువాత పంటకు దాదాపు రూ.3 లక్షల రాబడి వస్తుంది. ఇలా తులసి సాగు చేస్తే ఎంతో లాభం ఉంటుంది.
తులసి లాగే ఉండే మరో పంట స్టెవియా. ఇది కూడా ఎక్కువ లాభాలు ఇస్తుంది. పరాగ్వే, జపాన్, కొరియా, తైవాన్, అమెరికా లాంటి దేశాల్లో దీన్ని పండిస్తుంటారు. మధుమేహానికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. దీని సాగుకు ఎరువులు, మందులు అవసరం లేదు. మన దేశంలో బెంగుళూరు, ఇండోర్, పుణె, రాయ్ పూర్ వంటి నగరాల్లో స్టెవియా సాగుచేస్తున్నారు.
ఒక ఎకరం సాగుచేయడానికి రూ. 1 లక్ష ఖర్చవుతుంది. కానీ రాబడి మాత్రం రూ. 6 లక్షలు వస్తుంది. రైతుకు రూ. 5 లక్షల లాభం వస్తుంది. ఇలా స్టెవియా సాగు చేయడం వల్ల రైతుకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల దీని సాగు వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో దీని సాగు చేపట్టి లాభాల పంట పండించుకోవచ్చని చెబుతున్నారు.