
విదేశాలకు వెళ్లాలనే కోరిక అందరికి ఉంటుంది. అందుకు తగిన పరిస్థితులు వస్తే ఎవరు కూడా వదులుకోరు. కాకపోతే విమాన చార్జీలు మోతమోగిస్తాయి. ఈ నేపథ్యంలో విదేశాలను చుట్టి రావాలనే కోరిక మనసులోనే అణచుకుంటారు. కానీ మనదేశంలోని కొన్ని రైల్వే స్టేషన్ల నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చాలా మందికి తెలియదు. మన దేశం నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల ద్వారా నడిచే రైళ్లు నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు వెళ్తుంటాయి. వాటిలో మనం ఆ దేశాలు చుట్టి రావచ్చు.
కోల్ కతా రైల్వే స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ వెల్లే బంధన్ ఎక్స్ ప్రెస్ రైలు బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని పెట్రాపోల్ రైల్వేస్టేషన్ లో ఆగుతుంది. ఇది బంగ్లాదేశ్ వెళుతుంది. ఇందులో మనం బంగ్లాదేశ్ వెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకు వీసా, పాస్ పోర్టు కూడా ఉండాలి. ఇలా మనం బంగ్లాదేశ్ వెళ్లి రావచ్చు.
బీహార్ లోని జయనగర్ రైల్వేస్టేషన్ మధులని జిల్లాలో ఉంది. ఇక్కడ నుంచి నేపాల్ వెళ్లొచ్చు. జనక్ పూర్ వద్ద కుర్తా స్టేషన్ ద్వారా నేపాల్ కు అనుసంధానించారు. రెండు దేశాల మధ్య ప్యాసింజర్ రైలు నడిపిస్తున్నారు. ఈ రైలు ద్వారా మనం నేపాల్ వెళ్లడానికి పాస్ పోర్టు కానీ వీసా కానీ అవసరం లేదు. ఎలాంటి ఆంక్షలు ఉండవు. మనం స్వేచ్ఛగా తిరిగి రావచ్చు.
ఢాకా వెళ్లాలంటే మిథాలీ ఎక్స్ ప్రెస్ లో న్యూజల్ పైగురి జంక్షన్ నుంచి వెళ్లొచ్చు. హల్దీబారి రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్లు భారత సరిహద్దు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్హతి రల్వే స్టేషన్ ద్వారా ఇది బంగ్లాదేశ్ కు అనుసంధానించారు. దీని ద్వారా మనం ఢాకా వెళ్లి రావచ్చు.
పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర దివాజ్ పూర్ జిల్లాలో రాధికాపూర్ స్టేషన్ ఉంది. ఇది కతిహార్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. రాధికాపూర్ స్టేషన్ నుంచి బంగ్లాదేశ్ లోని బిరల్ రైల్వే స్టేషన్ అనుసంధానించబడి ఉంది. ఇది ఇండో – బంగ్లాదేశ్ సరిహద్దులో ఉండటం వల్ల ఇక్కడనుంచి బంగ్లాదేశ్ చేరవచ్చు. ఇక్కడ నుంచి అస్సాం, బిహార్ ద్వారా బంగ్లాదేశ్ కు వస్తువులను రవాణా చేస్తుంటారు.






