
UBlood App : ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులకు సలహాలు, సూచనలు అందజేస్తారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబరు ఏర్పాటు చేశారు.
విజయవాడ నగరం జలమయమైన సంగతి తెలిసిందే. విజయవాడ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం చంద్రబాబు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిద్రను పూర్తిగా వదులుకుని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే నగరంలోని వరద బాధిత ప్రాంతాల బాధితుల కోసం నేను సైతం అంటూ జై స్వరాజ్య టీవీ, jsw టీవీ, U Blood టీం ముందుకు వచ్చింది. సమాజం పట్ల తనకున్న బాధ్యతను నెరవేర్చుకుంది. గ్లోబల్ అడ్వైజర్ ఫర్ జేఎస్ డబ్ల్యూ టీవీ అండ్ జై స్వరాజ్య వల్డ్ టీవీ గ్లోబల్ డిజిటల్ మీడియా, యూబ్లడ్ ఫౌండర్ డా. జై, జగదీష్ బాబు యలమంచిలి నేతృత్వంలో విజయవాడ లో దాదాపుగా 1000 మందికి ఫుడ్ ప్యాకేట్లను పంపిణీ చేసింది. మోకాళ్లోతు నీటిలొ చిక్కుకున్న బాధితులవద్దకు వెళ్లి మరీ ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఇప్పటి వరకు మాకు సాయం అందలేదని దేవుడిలా వచ్చి ఆదుకున్నారని బాధితులు జై స్వరాజ్య టీవీ, jsw టీవీ, U Blood టీంను ప్రశంసించారు.

యూ బ్లడ్ అంటే..
మానవ శరీరంలో అత్యంత కీలక భూమిక పోషించేది రక్తమే. శరీరంలోని అన్ని అవయవాలకు పోషక పదార్థాలు, ఆక్సిజన్ తీసుకెళ్లేది రక్తమే. అలాంటి రక్తాన్ని ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించలేదు. రక్తం దానం చేస్తే మరో వ్యక్తికి జీవితాన్ని ఇచ్చినట్టే అవుతుంది. అందుకే ‘రక్తదానం మహాదానం’ అన్నారు మన పెద్దలు. సరైన సమయంలో రక్తం లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలను వదులుతున్నారు. కీలకమైన ఆపరేషన్లు చేస్తున్న సమయంలో కూడా రక్తం చాలా అవసరం ఇంత అవసరమైన రక్తాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం చాలా కష్టం మూడు నెలల కంటే దాదాపుగా ఎక్కువ నిల్వ చేయలేం. దీని కన్నా లైవ్ బ్లడ్ చాలా మేలని చాలా సందర్భంగాల్లో డాక్టర్లు చెబుతూనే ఉంటారు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు తన వంతుగా ఈ విషయంలో సమాజానికి ఏదైనా చేయాలని తలిచారు. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే ‘యూ బ్లడ్’ యాప్. ఆయన తండ్రి కోరిక మేరకు ఎన్నో రోజులు కష్టపడి ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చారు. దీని ద్వారా సరైన సమయంలో గ్రహీతకు లైవ్ బ్లడ్ అందుతుంది. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకుంటే సమీపంలోని గ్రహీతకు మెసేజ్ వెళ్తుంది. అంటే దాత వెంటనే హాస్పిటల్ లేదా రక్తదాన కేంద్రానికి వచ్చి లైవ్ లో రక్తం ఇవ్వచ్చు. ఇలాంటి యాప్ వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించేందుకు వీలు కలుగుతుంది.