‘డీజే టిల్లు’తో కుర్రకారును తన వైపునకు తిప్పుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. గతంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు మూస ధోరణిలో వెళ్లినా ‘డీజే టిల్లు’ ఆయన కెరీర్ ను ఒక మలుపుతిప్పింది. సినిమా రిలీజై ఏడాది పూర్తయినా ‘నువ్వు నన్ను అడుగుతున్నావా రాధిక’ అంటూ సాగే డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారంటే ఆడియన్స్ లో దీని క్రేజ్ ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. అయితే చిరంజీవి, జొన్నలగడ్డ సిద్ధు కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్నట్లు చిత్రవర్గాల నుంచి లీకులు వినిపిస్తున్నారు. అగ్రహీరోతో అప్ కమింగ్ హీరో ఈ వార్త చాలా క్రేజ్ గా ఉందని ఆడియన్స్ ఇప్పటికేఈ కాంబో కోసం ఎదురు చూస్తున్నారు. చిరు కామెడీ టైమింగ్, సిద్ధు టైమింగ్ ఈ రెండూ కలిస్తే థియేటర్ థియేటర్ అంతా నవ్వులే నవ్వులు..
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఇటీవల చిరంజీవికి ఒక కథ చెప్పారట. అయితే కథ ప్రకారం ఇందులో ఒక యువ హీరో కూడా ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం సిద్ధు జొన్నలగడ్డను తీసుకుందామని చిరంజీవినే డైరెక్టర్ కు సజెష్ చేశారట. ఊహించని విధంగా చిరంజీవి సిద్ధు పేరును సూచించడడంతో కళ్యాణ్ కృష్ణ ఆశ్చర్యపోయారట. దీనిపై సిద్ధును కూడా సంప్రదిస్తే మెగాస్టార్ తో చేసేందుకు అవకాశం ఎవరు వదులుకుంటారని ఒకే చెప్పారట. అయితే ఈ చిత్రానికి ‘ధమాకా’ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఆయన కథలన్నీ ఎంటర్టైన్మెంట్ తో కూడినవే. ఈ కాంబోను వెండితెరపై చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు మరి. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.