
Guess this child : అందం, అభినయం ఎంత ఉన్నా ఈ హీరోయిన్ కు మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు మూవీస్ లో కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా హడావుడి లేదు. ఎందుకా.. అని ఆరా తీయగా.. యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు కొంచెం బ్రేక్ పడిందని, ఆ తర్వాత కోలుకున్నానని చెప్పింది. విషయం తెలిసి ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు.
ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. వరుసగా ఫొటో షూట్స్ షేర్ చేస్తూ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కొత్త సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఆ ఫొటోలో తన తండ్రితో ఉన్న నటిని గుర్తుపట్టారా? మీకోసం ఒక హింట్ ఆమె టాలీవుడ్ టాలెండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలో నటించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె హీరోయిన్ నభా నటేష్.
2018లో వచ్చిన ‘దోచుకుందువటే’తో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ భామ నభా నటేష్. 2019లో పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ లో నటించింది. ఈ మూవీతో నభా క్రేజ్ అమాంతం మారిపోయింది. కానీ అవకాశాలు మాత్రం ఇంటి గడప తొక్కలేదు. ఇస్మార్ట్ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లో కనిపించింది. 2021లో యాక్సిడెంట్ అవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పడిప్పుడే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
రీసెంట్ గా ఈ బ్యూటీ క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. అదేంటంటే? యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభు’లో నటించే ఛాన్ కొట్టేసింది. యాక్సిడెంట్ తర్వాత మళ్లీ సెట్ లోకి అడుగుపెడుతున్నట్లు. పీరియాడిక్ గెటప్ తో ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం నభా నటేష్ న్యూ లుక్ నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram






