Salt : ఉప్పుతో ముప్పే. ఉప్పు తినడం వల్ల ఆరోగ్యానికి చేటు. దీని వల్ల కండరాలు దెబ్బతింటాయి. అవయవాలకు నష్టం కలుగుతుంది. అధిక రక్తపోటు ఉంటే పక్షవాతం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంటుంది. ఉప్పు అధికంగా తినడం వల్ల రక్తనాళాలు దెబ్బ తింటాయి. ఫలితంగా అనేక ఇబ్బందులు వస్తాయి. రక్తనాళాల్లో ఉప్పు పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముంది.
ఉప్పు తినడం వల్ల మోకాళ్ల, కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. కీళ్ల జాయింట్లలో ఉప్పు పేరుకుపోయి నొప్పి వస్తుంది. కానీ మనం వైద్యుడి దగ్గరకు వెళ్లి అతడు ఇచ్చే మందులు వాడుతుంటాం. దీని వల్ల ఇబ్బందులు రావడం ఖాయం. ఉప్పు ముప్పు మనకు అధికంగానే ఉంటుంది. దీని వల్ల మన ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
ఒక మనిషి ఒక రోజుకు కేవలం మూడు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ మనం 9 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాం. ఫలితంగా అనేక జబ్బులకు కారణంగా నిలుస్తోంది. అయినా ఉప్పును వదలడం లేదు. వైట్ ప్రొడక్ట్స్ వల్ల ఆరోగ్యం క్షీణించడం కామనే. అందులో ఉప్పు ప్రధానమైనది. కొందరు కూరల్లో వేసే ఉప్పు కాకుండా మీద నుంచి చల్లుకుంటారు.
ఇలా ఉప్పుతో మనకు ఇబ్బందులున్నా దాని వాడకం మాత్రం ఆపడం లేదు. అన్ని కూరల్లో ఉప్పు మోతాదు మించి వాడుతుంటాం. దీంతో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. అసలు మొత్తానికి ఉప్పును విడిచిపెడితేనే మేలు. ఈ నేపథ్యంలో ఉప్పు వల్ల మనకు అనారోగ్యం దరిచేరుతుందని తెలుసుకుని దాన్ని ముట్టకుండా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.