
maida pindi : మనం మైదాపిండిని వాడొద్దని చాలా మంది చెబుతుంటారు. కానీ మనం పట్టించుకోం. ఇది రెండు సార్లు పట్టిస్తే బయటకు వస్తుంది. అందుకే మైదాపిండిని వాడకూడదు. దీనికి బదులుగా గోధుమ పిండిని వాడటం మంచిది. మైదాపిండి తినడం వల్ల మనకు ఎన్నో నష్టాలు ఉంటాయి. ఈనేపథ్యంలో మైదాపిండిని వాడకుండా ఉండటమే శ్రేయస్కరం.
మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల శరీరంలో చక్కెర పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ అధికం కావడంతో షుగర్ నియంత్రణలో ఉండదు. రక్త ప్రవాహంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు మైదాను తింటే ప్రమాదమే. మైదా ఫుడ్స్ లో జంక్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి మంచిది కాదు.
మైదా పిండి మన శరీర మెటబాలిజంను దెబ్బ తీస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. బరువు పెరిగేందుకు కారణమవుతుంది. ఊబకాయం, స్థూలకాయం సమస్య ఇబ్బందులకు గురిచేస్తుంది. మన జీర్ణక్రియ త్వరగా జరగకుండా చేస్తుంది. ఇందులో ఫైబర్ ఉండదు. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల కష్టాలకు గురికావడం కామనే.
మైదా తింటే పేగులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. దీంతో మంచి బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. మైదాను తినే బదులు గోధుమ పిండిని తినడం ఉత్తమం. దీన్ని తినడం వల్ల ఎముకల బలం తగ్గిపోతుంది. శరీరంలో చెడు కొవ్వు పెరుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. రక్తనాళాలకు రక్తప్రసరణ సరిగా జరగకుండా చేస్తుంది.






