ఉదయం పూట కొందరికి ఆకలి బాగా వేస్తుంది. అలాంటి సమయంలో నీళ్లు తాగితే బాగా తినాలనే కోరిక తగ్గుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. నీటికి అంతటి శక్తి ఉంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే లీటరు పావు నీళ్లు తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. ఉదయం నీళ్ల తాగితే మన మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. శరీరం హైడ్రేడ్ గా ఉంటే మెదడుకు ఏకాగ్రత పెరగుతుంది.
ఉదయం లేవగానే చాలా మంది ఆవలింతలు తీస్తుంటారు. దీనర్థం బద్ధకంగా ఉండటమే. ఓ గ్లాసు నీరు తాగితే అది కాస్తదూరమవుతుంది. చురుకుదనం వస్తుంది. నీరసం లేకుండా పోతుంది. నీళ్లు తాగడం వల్ల చర్మానికి ముడతలు రాకుండా ఉంటాయి. శరీరంలోని మలినాలను దూరం చేస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపరుస్తుంది. అందుకే ఉదయం నీళ్లు తాగడం శ్రేయస్కరం.
శరీరం డీ హైడ్రేడ్ కు గురైతే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. ఇంకా శరీరంలో వాపులు, నొప్పులు వస్తుంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నీళ్లు తాగడమే మందులా పనిచేస్తుంది. రాత్రి సమయంలో మన శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తుంటాయి. ఇలాంటి వారికి ఉదయం నీళ్లు తాగితే మళ్లీ సాధారణ స్థితికి చేరుతాయి. ఇలా మంచినీరు మన జీవితంతో పెనవేసుకుపోయింది. అందుకే నీళ్లు తాగడం వల్ల మనకు మంచి ప్రయోజనాలే ఉంటాయి.