ప్రస్తుతం మనలో చాలా మంది ఆహార అలవాట్లు పాటించడం లేదు. ఫలితంగా బాణపొట్ట వస్తోంది. కడుపు ముందుకు వచ్చి వింత ఆకారంలో తిరుగుతున్నారు. దీనిపై ఆందోళన చెందుతున్నారు. నలుగురిలో నడవాలంటేనే సిగ్గుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. నాజూకుగా ఉండాలని ఆశ ఉన్నా తమ దేహం సహకరించడం లేదని అంటున్నారు కానీ మంచి అలవాట్లు మాత్రం తీసుకోవడం లేదు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
మనం ఆహారం తిన్న వెంటనే కొందరు నిద్రపోతారు. ఇది కరెక్టు కాదు. తిన్న తరువాత కనీసం ఓ గంటపాటు వాకింగ్ చేయాలి. దీంతో మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. ఫలితంగా మనకు నిద్ర మంచిగా పడుతుంది. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిలో నిద్ర కూడా ఒకటి కావడం గమనార్హం. దీంతో మన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిందే.
మనం ఆహారం తీసుకున్న తరువాత యోగా చేస్తే మంచిది. ఇందులో పవన ముక్తాసనం బాగా ఉపకరిస్తుంది. పొట్ట రాకుండా చేసే ఆసనాల్లో ఇది ప్రధానమైనది. ఇలా చేయడం వల్ల మన పొట్ట పెరగకుండా చేస్తుంది. దీనికి అందరు చేసేందుకు మొగ్గు చూపాలి. దీని వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా ఆరోగ్యం కాపాడుకోవడంలో మన చర్యలు కూడా కీలకం కానున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళ్లాలి. దీనికి ఆహారం, యోగా తదితర మార్గాలతో మంచి ఫలితాలు సాధించుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.